Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను భయపెట్టాలనుకుంది... కానీ నిప్పంటుకుని..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (18:24 IST)
భర్తను భయపెట్టాలనుకుంది. అంతే ఒంటిపై నూనె పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు నటించిన భార్యకు, నిజంగానే నిప్పంటుకున్న విషాదం చెన్నైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన అనితకు మదురవాయల్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 
 
వివాహం జరిగి ఏడాది అయ్యింది. వీరిద్దరూ మదురైవాయల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు. అయితే కొద్ది నెలల నుంచి వినోద్ కుమార్ మద్యం సేవించడం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది.
 
దీంతో భర్తను మార్చాలని.. మద్యం అలవాటుకు చెక్ పెట్టాలని భావించిన అనిత నూనె శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని భర్తను భయపెట్టాలనుకుంది. కానీ నిజంగానే నిప్పంటుకోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments