Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రేమతో పిలిచిందని వెళ్లితే.. కిరాతంగా చంపించి రైలు పట్టాల పక్కన పడేసింది!

భార్య ప్రేమతో పిలిచిందని ఇంటి నుంచి బయలుదేరిన భర్తను... తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపిన దారుణ ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. పైగా.. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేసి..

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (11:38 IST)
భార్య ప్రేమతో పిలిచిందని ఇంటి నుంచి బయలుదేరిన భర్తను... తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపిన దారుణ ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. పైగా.. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేసి.. రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కన్యాకుమారి జిల్లా కల్లువినై అనే ప్రాంతానికి చెందిన జగన్‌ బాబు (27) అనే వ్యక్తికి సమీప బంధువు అయిన అజిత (23) అనే యువతితో నెల రోజుల క్రితం వివాహమైంది. అయితే, అజిత వివాహానికి ముందు నుంచే చెన్నై, కోడంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ వస్తోంది. ఇదే ఆస్పత్రిలో పని చేసే జాన్‌ ప్రిన్స్‌ (25) అనే యువకుడితో గాఢమైన ప్రేమలో పడిపోయింది. 
 
అయితే, ప్రిన్స్‌తో ప్రేమలో మునిగిపోయిన అజిత భర్తతో కాపురం చేయలేకపోయింది. ఈ విషయాన్ని ప్రియుడి వద్ద చెప్పి బోరున విలపించింది. దీంతో వీరిద్దరు కలిసి జగన్‌బాబును హత్య చేయాలని ప్లాన్‌ వేశారు. భర్తను చెన్నైకు అర్జంటుగా రమ్మని భార్య అజిత చెప్పింది. పాపం భార్యకు ఏ కష్టమొచ్చిందో ఏమోనని ఈనెల 7వ తేదీన అర్థరాత్రి సమయంలో తిరుచ్చి స్టేషన్‌కు జగన్‌ వచ్చాడు. అక్కడ అజిత ప్రయుడు జాన్‌ ప్రిన్స్‌ను పరిచయం చేసుకుని ఇద్దరూ కలిసి చెన్నైకు వచ్చేలా ప్లాన్ వేసుకున్నారు. 
 
రైల్వే స్టేషన్‌కు జగన్ వస్తానే ముందుగా వేసుకున్న ప్లాన్‌లో భాగంగా, జగన్‌ను స్టేషన్‌ వెలుపలికి తీసుకెళ్ళి హత్య చేసి, మృతదేహాన్ని పట్టాలపై అడ్డంగా పడేశాడు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో అటుగా వచ్చిన అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ పట్టాలపై మృతదేహం పడివుండటాన్ని గమనించి.. రైల్వే పోలీసులకు సమాచారం తెలిపాడు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, జగన్‌ బాబు మొబైల్‌ నంబరు ఆధారంగా నిందితులను గుర్తించారు. దీంతో అజితతో పాటు జాన్‌ ప్రిన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments