Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు.. తాళి కట్టాడు... తల్లిదండ్రులు అభ్యంతరంతో కాపురం చేయనంటున్నాడు!

తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 18 యేళ్ల యువతిని ప్రేమించిన ఓ యువకుడు.. స్థానిక అమ్మవారి సాక్షిగా దేవాలయంలో తాళికట్టాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (11:17 IST)
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 18 యేళ్ల యువతిని ప్రేమించిన ఓ యువకుడు.. స్థానిక అమ్మవారి సాక్షిగా దేవాలయంలో తాళికట్టాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, ఈ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో కట్టుకున్న భార్యతో కాపురం చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో భర్త ఇంటిముందు భార్య మౌనపోరాటానికి దిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆత్రేయపురం మండలం పేరవరానికి చెందిన వేముల దుర్గ (18) అమ్మమ్మ ఊరు అయినాపురం చిట్టిచెరువుకు చెందిన నిచ్చెనకోళ్ల నాగరత్నం ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. యేడాది క్రితం అదే గ్రామానికి చెందిన శెనగన కృపాపాల్‌తో ప్రేమలో పడింది. నెలరోజుల క్రితం పేరవరం వెళ్లడంతో ఆదివారం కృపాపాల్‌ అక్కడికి వెళ్లి దుర్గను తీసుకువచ్చాడు. 
 
గత సోమవారం మహిపాల చెరువు వద్ద కనకదుర్గ ఆలయంలో తాళికట్టి ఇంటికి తీసుకొచ్చాడు. వారిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించాల్సిన తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. దీంతో భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఈ విషయంపై పెద్దలు పంచాయితీ నిర్వహించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో శుక్రవారం రాత్రి నుంచి కృపాపాల్‌ ఇంటి ఎదుట దీక్ష చేపట్టినట్టు దుర్గ తెలిపింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments