Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? చర్చనీయాంశంగా జస్టీస్ ధర్మసందేహం!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? అనే చర్చ ఇపుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై మద్రాస

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (14:32 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? అనే చర్చ ఇపుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ గురువారం విచారణ జరిపారు. 
 
ఈ విచారణ సంద్భంగా హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆమె మృతిపై ఉన్న సందేహాలకు మరింత ఊతమిచ్చాయి. జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయని, అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. 
 
అందువల్ల జయలలిత అనుమానాస్పద మృతిపై సందేహాలు తొలగేందుకు ఆమె మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయకూడదనే కొత్త వాదనను హైకోర్టు తెరపైకొచ్చింది. అలా చేస్తే వాస్తవాలు బయటికొచ్చే అవకాశమున్నట్లు న్యాయస్థానం భావిస్తోంది.
 
పైగా, మీడియాలో కూడా జయలలిత మృతిపై అనేక సందేహాలు వ్యక్తపరుస్తూ వార్తలొచ్చాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఏదిఏమైనా జయలలిత చికిత్సకు సంబంధించి సమగ్రమైన నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీచేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments