Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దేశంలో ఆంధ్రా భాగం కాదా? చౌకీదార్ కాస్త చోర్ అయ్యాడు : రాహుల్ ధ్వజం

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:08 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. చౌకీదార్ కాస్త చోర్ అయ్యారంటూ మండిపడ్డారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతల తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని నిలదీశారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 
 
'ఏపీ ప్రజలకు అండగా ఉంటాను. ఎక్కడికి వెళితే అక్కడ మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆయనపై నమ్మకం పోయింది. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రాఫెల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా? చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోడీని, బీజేపీని ఓడిద్దాం' అంటూ ధర్మపోరాట దీక్షా వేదిక సందర్భంగా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments