Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైళ్లకు మరో ప్రమాదం.. 5 గంటలు ఆగిన రైలు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (10:45 IST)
భారతీయ రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న గాంధీ నగర్ - ముంబై రైలు వరుసగా గురు, శుక్రవారాల్లో ప్రమాదాలకు గురైంది. తొలు రోజున గేదెలను ఢీకొనగా, మరుసటి రోజున గోవులను ఢీకొట్టింది. 
 
తాజాగా శనివారం ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఈ రైలు మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ సమీపాన రైల్లోని సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటారులో బేరింగు పనిచేయలేదు. దీంతో చక్రాలు దెబ్బతిని మొరాయించాయి. 
 
క్షేత్ర సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైలును నియంత్రిత వేగంతో 20 కి.మీ. దూరంలో ఉన్న ఖుర్జా రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ఆపారు. అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 1,068 మంది ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments