Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

ఠాగూర్
బుధవారం, 7 మే 2025 (08:25 IST)
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మగంళవారం అర్థరాత్రి పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులకు 'ఆపరేషన్ సింధూర్' అని నామకరణం చేసింది. ఇలాంటి పేరు పెట్టడంలోనూ బలమైన సందేశం ఇమిడివుంది. 
 
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో సేదతీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరుచేసి, వారిని మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. ఉగ్రమూకల టార్గెట్‌ చేసిన జంటల్లో అప్పటికి వివాహం చేసుకుని కేవలం ఆరు రోజులే అయిన నూతన వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షిలు ఉన్నారు. ఉగ్రవాదులు వినయ్‌ను హత్య చేయగా, అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. 
 
పైగా, వినయ్ భారత నేవీ అధికారి కావడం గమనార్హం. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధూరాన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ ఆపరేషన్‌కు సింధూరం అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌కు త్రివిధ దళాలు సమన్వయంతో నిర్వహించాయి. కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్  సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం