Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇవ్వలేదనీ స్కూటరిస్టును చంపేసిన బెంగాల్ పోలీసులు

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు.

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (17:31 IST)
హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రద్దీ కూడలిలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో సౌమెన్ దేబ్‌నాథ్ (49) హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నాడు. దీన్ని గుర్తించిన బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు ఆయనను ఆపారు. హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
దీంతో వలంటీర్లు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. స్థానికులు ఆయనను కాపాడేందుకు వెళ్ళారు. దీన్ని గమనించిన పోలీసు వాలంటీర్లు పారిపోయారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన దేబ్‌నాథ్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ఆసుపత్రిలో మరణించారు. దీంతో మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెగ్యులర్ పోలీస్ సిబ్బంది, సివిక్ పోలీస్ వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments