Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో ఉరివేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే... ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (11:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడుపై కూడా దాడి జరిగింది. అలాగే, మరికొందరు ఎమ్మెల్యేలపై కూడా దాడి జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి చెందిన దేవేంద్రనాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు. 
 
ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. అయితే బీజేపీ మాత్రం దీనిని హత్యే అని ఆరోపిస్తోంది. ఓ షాపు దగ్గర ఎమ్మెల్యే ఉరేసుకున్నట్లు తాము గుర్తించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు ప్రకటించారు. అయితే ఈయన ఎందుకు ఉరేసుకున్నారన్నది మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
ఈ సంఘటనపై బెంగాల్ బీజేపీ ట్వీట్ చేస్తూ... 'ఉత్తర దినాజ్‌పూర్‌లోని రిజర్వ్‌డ్ సీట్ అయిన హేమతాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ ఇంటికి సమీపంలో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఆయన్ను ఎవరో చంపారు. ఆ తర్వాతే ఉరి తీశారు. ఆయన 2019లో బీజేపీలో చేరారు. ఇదే ఆయన చేసిన తప్పేమో?' అని బీజేపీ ట్వీట్ చేసింది.
 
మరోవైపు, ఎమ్మెల్యే ఉరి ఘటనపై బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ధన్కర్ స్పందించారు. 'ఈ ఉదంతం అనేక ఆరోపణలకు తావిస్తోంది. హత్య చేశారన్న ఆరోపణలూ వస్తున్నాయి. సత్యాన్ని ఆవిష్కరించడానికి, రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments