Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి

దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి
, బుధవారం, 24 జూన్ 2020 (12:47 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే వుంది. తాజాగా దేశంలో రికార్డు స్థాయికి చేరాయి.  గడచిన 24 గంటల్లో 15,968 కరోనా కేసులు నమోదు కాగా, 465 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు. 
 
కరోనా వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో ఓ ఎమ్మెల్యే మరణించారు. అంతకుముందే తమిళనాడులోనూ ఎమ్మెల్యే బలయ్యారు. జూన్ 23 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 73 లక్షల 52 వేల 911 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో తమోనష్ ఘోష్ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుపార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీఎంసీ ఎమ్మెల్యే మృతికి సీఎంమమతా బెనర్జీ, పార్టీనేతలు సంతాపం తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పతంజలి కరోనిల్: కరోనాకు మందు తయారు చేశామన్న రాందేవ్ బాబా.. ప్రచార ప్రకటనలు ఆపాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ