Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో వందే భారత్ రైలుపై అగంతకుల రాళ్లదాడి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:54 IST)
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు హౌరా వెళ్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మల్దాలోని కుమార్‌గండ్ స్టేషన్‌‍లో ఈ ఘటన జరిగింది. 
 
డిసెంబరు 30వ తేదీన వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది దేశంలో ఏడో వందే భారత్ రైలు. హౌరా - న్యూజుల్పాయిగురి స్టేషన్ల మధ్య నడుస్తుంది. అయితే, ఈ రైలును పట్టాలెక్కించిన నాలుగు రోజుల్లోనే అగంతకులు ఈ రైలుపై రాళ్లదాడి చేశారు. ముఖ్యంగా ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
రైలు కుమార్‌గంజ్ స్టేషన్ దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలా కాలేదు. ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో ఈస్టర్న్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments