Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో వందే భారత్ రైలుపై అగంతకుల రాళ్లదాడి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:54 IST)
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు హౌరా వెళ్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మల్దాలోని కుమార్‌గండ్ స్టేషన్‌‍లో ఈ ఘటన జరిగింది. 
 
డిసెంబరు 30వ తేదీన వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది దేశంలో ఏడో వందే భారత్ రైలు. హౌరా - న్యూజుల్పాయిగురి స్టేషన్ల మధ్య నడుస్తుంది. అయితే, ఈ రైలును పట్టాలెక్కించిన నాలుగు రోజుల్లోనే అగంతకులు ఈ రైలుపై రాళ్లదాడి చేశారు. ముఖ్యంగా ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
రైలు కుమార్‌గంజ్ స్టేషన్ దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలా కాలేదు. ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో ఈస్టర్న్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments