Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:45 IST)
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనను విడుదల చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
 
ఆదివారం గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చందన్న కానుకల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, శ్రీనివాస్‌కు రిమాండ్ విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. ఆ తర్వాత రూ.25 వేల పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం