Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:45 IST)
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనను విడుదల చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
 
ఆదివారం గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చందన్న కానుకల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, శ్రీనివాస్‌కు రిమాండ్ విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. ఆ తర్వాత రూ.25 వేల పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం