Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణస్థలం వేదికగా జనసేన యువశక్తి - పోస్టర్ ఆవిష్కరించిన పవన్

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (19:31 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ జరుగనుంది. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ యువశక్తి సభకు సంబంధించిన పోస్టరును ఆయన సోమవారం ఆవిష్కరించారు. 
 
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి యువతీ యువకులంతా ఆహ్వానితులేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. 
 
దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని చెప్పారు. అయితే, ఉత్తారాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధఇ అవకాశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొనివుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో వలసలు, విద్య, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో తాము మాట్లాడటం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments