తెలుగు వారికి గుడ్ న్యూస్ చెప్పిన మమత బెనర్జీ..!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:15 IST)
తెలుగు వారికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాషా హోదా ఇస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్‌లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'మినీ ఆంధ్రా'గా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకునేందుకు మమత సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని వారంతా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ మేరకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments