Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మ్యాన్ ఈటర్ టైగర్' చనిపోయింది.. పులి పొట్టలో మహిళ వెంట్రుకలు... చెవిరింగులు!!

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (10:12 IST)
మ్యాన్ ఈటర్ టైగర్ అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో అందరినీ హడలెత్తించిన ఈ టైగర్ అనుమానాస్పదంగా చనిపోయింది. ఈ పులి కళేబరానికి శవపరీక్ష చేయగా, పొట్టలో మహిళ వెంట్రుకలతో పాటు ఆమె చెవి దుద్దులు ఉన్నాయి. 
 
కాగా, ఇటీవల వయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలో ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే కార్మికురాలిపై పులి దాడి చేసి, సగం తినేసింది. అలాగే, ఓ అటవీశాఖ అధికారిపై కూడా ఈ పులి దాడి చేసి గాయపరిచింది. పులి కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో, ప్రభుత్వం ఈ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, చంపేసేందుకు ఆదేశాలిచ్చింది.
 
అయితే, ఎవరూ ఊహించని రీతిలో పిలకావు ప్రాంతంలో ఓ పాడుపడిన ఇంటి వెనుక ఆ పులి చనిపోయి కనిపించింది. ఆ పులిపై ఉన్న గాయాల ఆధారంగా, మరో క్రూరమృగం దాడిలో ఆ పులి మరణించి ఉంటుందని అంచనాకు వచ్చారు. 
 
కాగా, ఆ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం నిర్వహించగా... ఆ పులి పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు కనిపించాయి. అవి ఇటీవల పులిదాడిలో మరణించిన రాధ అనే మహిళవని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పులికోసం అటవీశాఖ సిబ్బంది వేట కొనసాగిస్తున్న వేళ.. సోమవారం ఉదయం దాని జాడలు కనిపించాయి. అనంతరం పిలకావు ప్రాంతంలో ఓ ఇంటి వెనుక పులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments