Webdunia - Bharat's app for daily news and videos

Install App

153కి చేరిన కేరళ వయనాడ్ మృతులు.. 98 మంది గల్లంతు

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (09:52 IST)
Wayanad
కేరళలోని వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం మరణించిన వారి సంఖ్య 153కి చేరుకుంది. ఇంకా 98 మంది గల్లంతయ్యారు. చురల్‌పర, వేలరిమల, ముండకాయిల్‌, పోతుకాలు తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ఆర్మీ, వైమానిక దళం, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక దళం, స్థానికులకు చెందిన రెస్క్యూ టీమ్‌లు మంగళవారం అర్థరాత్రి వరకు ఆపరేషన్‌లో నిమగ్నమై బుధవారం తెల్లవారుజామున చేరుకున్నాయి. 
 
రెస్క్యూ టీమ్‌లు ధ్వంసమైన ఇళ్ల చుట్టూ సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధిత ప్రాంతాలకు వెళ్లే చాలా రహదారులు రద్దీగా ఉండటంతో రెస్క్యూ వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రజలు వాయనాడ్‌కు వెళ్లకుండా నిలిపివేశారు. రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి మరింత శిక్షణ పొందిన వ్యక్తులతో రెస్క్యూ టీమ్‌లను బలోపేతం చేస్తున్నారు.
 
 ఎన్‌డిఆర్‌ఎఫ్, డిఫెన్స్ రెస్క్యూ టీమ్‌లు మంగళవారం అర్థరాత్రి వరకు ప్రభావిత ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో 500 మందికి పైగా ప్రజలను రక్షించగలిగాయి. బెయిలీ వంతెనలు, రోప్‌వేలను బలగాలు ఏర్పాటు చేశాయి. తద్వారా సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఐదుగురు కేరళ మంత్రులతో కూడిన బృందం వాయనాడ్‌లో మకాం వేసి సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments