Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌కు హెచ్చరిక

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:02 IST)
గుజరాత్‌ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు 2వ తేదీ వరకు అరేబియా సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు సాయంత్రానికల్లా ఒడ్డుకు తిరిగి రావాలని సూచించింది. గులాబ్‌ తుపాను ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి తన బులెటిన్‌లో పేర్కొంది. దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాలతో పాటు సౌరాష్ట్ర రీజియన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న రెండు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. గుజరాత్‌లో ఇప్పటి వరకు వార్షిక సగటు వర్షపాతంలో 90 శాతం నమోదైందని రాష్ట్ర ప్రత్యేక అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్‌ఇఒసి) తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments