Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (17:12 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
ప్రతి జీవితం ఎంతో విలువైనది. రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దు. అలాంటి వారు సమాజానికి ప్రమాదకారులు. వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ తరహా ప్రవర్తనను ఉపేక్షించం. కొన్ని పార్టీలు రాజకీయ లబ్దికోసం మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి చర్యలకు లొంగకండి. 
 
మతం అంటే మానవత్వం. నాగరికత. సామరస్యం అని నా భావన. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇక మీరంతా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్టాన్ని రూపొందించింది మేము కాదు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం. మీకు కావాల్సిన సమాధానాలు అడగాల్సింది కేంద్రాన్ని. ఆ చట్టాన్ని బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయబోం" అని ఆమె స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి దేశంలో అమల్లోకి వచ్చిందంటూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో శనివారం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రోడ్లను దిగ్బంధించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలపై కూడా దాడులకు తెగబడ్డారు. దీంతో 110 మందికిపై నిరసనకారులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments