Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత వల్లే మాకు ఈ కష్టాలు : దివాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (13:58 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు.
 
తమిళనాట తమపై వరుసగా జరుగుతున్న దాడులకు జయలలితే కారణమని ఆరోపించారు. తాను మరణించిన తర్వాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఎంతమాత్రమూ పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు.
 
జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు. శశికళను పూర్తిగా వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయలేదని, ఫలితంగానే ఆమె ఇపుడు జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
శశికళ కుటుంబీకులు చేసిన మోసం కారణంగానే జయలలితపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగి, మేమే అమ్మను మోసం చేసుంటే, ఆమె దోషిగా ఎలా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమ కుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నాడు.
 
'అమ్మ'తో కలిసున్న కారణంగానే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలంటూ సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments