విమానంలో ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని చితకబాది.. అర్థనగ్నంగా తిరుగుతూ..

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (14:52 IST)
ఇటీవలికాలంలో విమాన ప్రయాణికులు చేష్టలు ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతున్నాయి. కొందరు శృతిమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీరి చేష్టలు రోత పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు వీరంగం సృష్టించారు. సిబ్బందిని చితకబాది, అర్థనగ్నంగా తిరుగుతూ, బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. దీంతో విమానం నుంచి బలవంతంగా కిందకు దించేసిన సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ మహిళ ప్రయాణికురాలు వయసు 45 యేళ్లు. ఇటలీ దేశస్థురాలు. 
 
జనవరి 30వ తేదీ సోమవారం అబుదాబి నుంచి ముంబైకు విస్తారా ఎయిర్‌లైన్స్ వచ్చింది. ఈ విమానంలో ముంబైకు వచ్చిన ఆ మహిళ ఎకానమీ జర్నీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. అయితే, తాను బిజినెస్ క్లాస్‌లోనే కూర్చొంటానని పట్టుబట్టింది. దీనికి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో వారితో వాగ్విదానికి దిగి, వారిపై దాడి చేసింది. 
 
అంతటితో ఆగకుండా విమానంలో అర్థనగ్నంగా అటూఇటూ తిరుగుతూ నానా రచ్చ చేసింది. సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కెప్టెన్ వార్నింగ్ కార్డు జారీ చేశారు. ఆ తర్వాత విమాన సిబ్బంది అమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానం ల్యాండ్ కాగానే ఆమెను అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత ముంబై ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
"ప్రయాణికురాలి అసభ్య, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకువాల్సి వచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఘటన గురించి ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకున్నారు" అని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments