Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికలాంగురాలిపై అత్యాచారయత్నం.. శ్మశానవాటిక దగ్గరకు తీసుకెళ్లి..?

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:22 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పదమూడేళ్ల బాలిక మానసిక వికలాంగురాలు. ఆమెపై అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కన్నేశాడు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్థానిక శ్మశాన వాటికి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటు దాడి చేసి, శరీరంపై విచక్షణారహితంగా గాయపరిచాడు. 
 
ఆమె అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని రాజును పట్టుకుని దేహాశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. వికలాంగురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments