Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తల్లీ కూతుళ్ళ వివాహాలు.. మరిదిని పెళ్లాడిన వదిన

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:20 IST)
తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. సాధారణంగా తోబుట్టువులు లేదా స్నేహితుల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో ఒకే వేదికపై జరగడం చూస్తుంటాం.. కానీ ఇలా తల్లి, కూతురు ఒకే వేదికపై వివాహం చేసుకోవడంతో.. అందరూ వీరి వివాహాల గురించే చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గోరక్ పూర్ జిల్లాలో ఓ తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో జగదీష్ అనే వ్యక్తిని బేలాదేవి(53) పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కుమార్తె(27) ఇందు వివాహం కూడా జరిగింది. 
 
బేలాదేవి ఆమె భర్త సోదరుడిని వివాహం చేసుకుంది. వితంతువైన బేలాదేవి వివాహం వారి సంతానం అనుమతితోనే జరిగిందని... తన సంతానం ఒత్తిడితోనే తాను వివాహం చేసుకున్నానని.. బేలాదేవి వివాహం తర్వాత మీడియాతో చెప్పింది. అమ్మకు తోడు కావాలనే బాబాయ్‌తో ఆమె వివాహం జరిపించినట్లు బేలాదేవి కూతుళ్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments