Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శోభనం జరగలేదని తల్లిదండ్రులతో చెప్తావా? వధువు ఏం చేసిందంటే?

శోభనం జరగలేదని తల్లిదండ్రులతో చెప్తావా? వధువు ఏం చేసిందంటే?
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:30 IST)
తల్లిదండ్రుల ముందు.. మీ కుమార్తెతో శోభనం జరగలేదని అల్లుడు చెప్పడంతో పాటు.. ఆమె శోభనానికి నిరాకరించిందని.. దానికి కారణం ఏంటో అడిగి తెలుసుకోమని కొత్త పెళ్లి కొడుకు వధువు తల్లిదండ్రులను కోరడంతో నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలా పెళ్లి పారాణి కూడా ఆరక ముందే వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామనికి చెందిన స్వామి ప్రగతి నగర్ లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు, ఏపీలోని తమ స్వగ్రామంలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వేంకటేశ్వర రావుకి ఇచ్చి ఈ నెల 6వ తేదీన వివాహం జరిపించారు.
 
వివాహం అనంతరం శోభనం కోసం 9వ తేదీన ఏర్పాట్లు చేశారు. కానీ 10వ తేదీ ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, ఆమె నిరకారించింది అని అలా ఎందుకు నిరాకరించిందో కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులను కోరాడు. తమ మధ్య ఉండాల్సిన విషయం తల్లితండ్రుల ముందు చెప్పడంతో మనస్తాపానికి గురైన సౌజన్య, గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుంది. 
 
సౌజన్య తలుపు తీయకపోవటంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?