Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శోభనం పూర్తయ్యింది, తెల్లారేసరికి పెళ్లి కొడుకు చనిపోయాడు, ఏమైంది?

శోభనం పూర్తయ్యింది, తెల్లారేసరికి పెళ్లి కొడుకు చనిపోయాడు, ఏమైంది?
, గురువారం, 10 డిశెంబరు 2020 (18:51 IST)
వాళ్లిద్దరికీ పెళ్లి జరిగింది. జంట ఈడూజోడూ కుదిరిందనీ, చక్కగా వున్నారని అంతా చెప్పుకున్నారు. శోభనం మూడు రాత్రులు సంతోషంగా గడిచాయి. ఐతే మూడో రోజు తెల్లవారగానే పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు. ఏం జరిగింది?
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకి సమీపంలో గత వారం ఓ యువతీయువకుడికి పెళ్లయింది. బంధువులందరూ పెళ్లికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించి వెళ్లారు. జంట చూడచక్కగా వుందని చెప్పుకున్నారు. శోభనం మూడు రాత్రులు గడిచాయి. ఐతే అకస్మాత్తుగా పెళ్లికొడుకు తెల్లారేసరికి చనిపోయాడు. అంతా లబోదిబోమని ఏడ్చారు. అతడి అంత్యక్రియలు ముగించారు. ఐతే ఈ విషయం పోలీసులకు చేరింది.
 
అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 పరీక్షలు చేయించారు. అందులో పెళ్లికుమార్తెతో సహా మరో 8 మందికి కరోనావైరస్ వున్నట్లు తేలింది. దాంతో అంతా షాకయ్యారు. కానీ పెళ్లికొడుకు చనిపోయింది కరోనాతోనా లేదా అన్నది మాత్రం తెలియలేదు. పెళ్లికి ముందు సహజంగా వధూవరులు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి.
 
కానీ ఇతడి విషయంలో అది జరగలేదు. దాంతో అతడు కోవిడ్ కారణంగా చనిపోయి వుంటాడని అనుమానిస్తున్నారు. కాగా కరోనావైరస్ బారిన పడిన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పెళ్లింట కొత్తపెళ్లి కొడుకు చనిపోవడం, అంతా కరోనాతో ఆసుపత్రి పాలవడంతో ఆ పెళ్లికి వచ్చినవారు ఇప్పుడు కరోనావైరస్ టెస్టులు చేయించుకునేందుకు ఆసుపత్రి బాట పట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోగనిరోధక శక్తి ప్రయోజనాలతో ప్రోబయాటిక్‌ పెరుగును ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌