కరూర్ తొక్కిసలాట మృతులకు హీరో విజయ్ భారీ ఆర్థిక సాయం

ఠాగూర్
ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (12:45 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో సినీ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార ర్యాలీ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు. ఈ క్రమంలో విజయ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ఆదివారం వెల్లడించారు. 
 
కరూర్‌ ఘటనపై టీవీకే అధికారిక ఎక్స్‌ ఖాతాలో విజయ్‌ మరోసారి స్పందించారు. తన హృదయం ఇంకా భారంగానే ఉందన్నారు. తనను ఇష్టపడే వారిని కోల్పోయిన బాధను చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదన్నారు. ప్రచార సమయంలో అభిమానుల ముఖాల్లో చూసిన ఆనందం ఇంకా కళ్ల ఎదుట కదలాడుతోందన్నారు.  
 
ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు విజయ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను ఆ దుఃఖాన్ని మోస్తున్నానన్నారు. ఇది తమకు కోలుకోలేని నష్టమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు కానీ, వారిలో ఒకడిగా అండగా నిలబడటం తన కర్తవ్యమని విజయ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments