తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

ఐవీఆర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (22:41 IST)
ఇటీవల నటుడు విజయ్ పర్యటనలో కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సీనియర్ నటి అంబిక బాధితులను పరామర్శించేందుకు మంగళవారం నాడు వారి ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు. ఇంకా ఎంతోమంది నటీనటులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమైనది. ప్రాణాల విలువ వెలకట్టలేనిది.
 
నేను ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయడం లేదు. ప్రత్యేకించి ఏ పార్టీతోనూ నాకు అనుబంధం లేదు. అందుకోసం ఇక్కడికి నేను రాలేదు. ఈ సంఘటనతో మానసికంగా నేను కూడా ఎంతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులను కోల్పోయినవారిని ఓదార్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయ కారణం లేదు. ఈ సంఘటనలో బాధితులు నా మనవరాళ్ళు కావచ్చు. వారు నా పిల్లలు కావచ్చు. మరణించిన వారు నా సోదరుడు, తమ్ముడు, సోదరి, అత్త లేదా నా బంధువులు ఎవరైనా కావచ్చు అని అన్నారు.
 
గత నెల సెప్టెంబరులో విజయ్ ప్రచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ సంఘటన భారతదేశం అంతటా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు జరపాలని సిట్‌ను ఆదేశించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments