Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయానగరంగా న్యూఢిల్లీ, ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం

ఐవీఆర్
గురువారం, 14 మార్చి 2024 (23:33 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ మాయానగరంగా మారుతోంది. అక్కడ ప్రతి 14 నిమిషాలకు ఓ కారు దొంగతనం జరుగుతోంది. దేశంలో జరుగుతున్న కార్ల దొంగతనాల్లో 80 శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయంటే కారు దొంగలు ఇక్కడ ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. అక్నో డిజిటిల్ ఇన్సూరెన్స్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు వెలుగుచూసారు. ఢిల్లీలో తమ కారును అపహరించుకుపోయారంటూ పోలీసు స్టేషన్లలో ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య 105గా వున్నట్లు తేలింది. ఈ కేసులను చూస్తే.. గత ఏడాది కంటే రెండున్నర రెట్లు మేర కారు దొంగతనాలు జరిగినట్లు తేలిందని చెబుతున్నారు.
 
ఢిల్లీ నగరం తర్వాత రెండో స్థానంలో చెన్నై మహానగరం ఆక్రమించింది. చెన్నైలో 2022లో జరిగిన కారు దొంగతనాలు 5 శాతం వుంటే ఇప్పుడది 10.5 శాతానికి... అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మూడోస్థానంలో బెంగళూరు వున్నది. ఐతే హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో కారు దొంగతనాలు అంతగా లేకపోవడం చూస్తుంటే ఇక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా వున్నట్లు అర్థమవుతుంది.
 
దొంగిలించబడుతున్న కార్లలో అత్యధికంగా వేగనార్, మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, హుండయ్ ఐటెన్ కార్లు అధికంగా వుంటున్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments