Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం.. ఆహారంలో మానవ చేతిగోళ్లు..!

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (09:41 IST)
ముంబై-గోవా సీఎస్ఎంటీ- మడగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణీకుడికి అందించిన ఆహారంలో నాణ్యత కొరవడింది. ఆ ఆహారంలో మానవ వేలుగోళ్లు కనిపించాయి. 
 
దీన్ని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు రైల్వే అందించే ఆహార నాణ్యతతో తమ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
 
ఈ విషయం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తూ చర్యలు చేపట్టింది. 
 
ఈ విషయంపై IRCTC అధికారి ఒకరు మాట్లాడుతూ, "రైల్వేలో ప్రయాణికులకు మంచి ఆహారం అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని నియమించారు. కొన్ని ప్రోటోకాల్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక అధికారి మానిటరింగ్ డ్యూటీలో ఉన్నారు. 
 
ఈసారి IRCTC రత్నగిరిలోని వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. IRCTC తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో ప్రయాణీకులకు మంచి ఆహారం అందేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం