Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్‌ రైలులో మంటలు... వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

Webdunia
సోమవారం, 17 జులై 2023 (10:11 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లుగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దున్నపోతును ఢీకొనడంతో ఈ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరోమారు భారీ వర్షానికి వందే భారత్ రైలు లోపలి భాగం తడిసి ముద్దయింది. తాజాగా వందే భారత్ రైలింజిన్ ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన లోకే పైలెట్లు తక్షణం రైలును నిలిపివేసి మంటలను అదుపు చేడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ రేలు ఢిల్లీ వెళుతుండగా రాణి కమలాపతి (భోపాల్) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలెట్లు కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చొన్నారు. రైలు ఇంజిన్‌లోని బ్యాటరీలు తగలబడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని, ఈ బ్యాటరీలను తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లిందని రైల్వే శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments