Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి

Webdunia
శనివారం, 28 మే 2016 (17:49 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన పేరును సిఫార్సు చేసింది. దీంతో ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 
 
ఈనెల 19వ తేదీన వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లు రాగా, మిత్రపక్షమైన డీఎంకేకు రెండు సీట్లు వచ్చాయి. దీంతో మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. 
 
అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై గత వారం రోజులుగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా పలువురు సీనియర్ నేతలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. వీరందరినీ తోసిరాజనీ, ఢిల్లీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగివున్న కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణ స్వామిని సీఎం పదవి వరించింది. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పుదుచ్చేరిలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ దూతలుగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్‌లు హాజరయ్యారు. ఇందులో సోనియా మాటగా నారాయణ స్వామి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments