Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆరుగురు పోటీ!

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (09:19 IST)
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఆరుగురు నేతలు పోటీపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్ హోదాలో ఉన్న నేతల పేర్లను భాజపా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుధవారం జరిగే పార్టీ శాసనపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరుగురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
 
వీరిలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, రాష్ట్ర మంత్రులు ధన్​సింగ్ రావత్, సత్​పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతలను ఇందుకోసం భాజపా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
బుధవారం జరగనున్న పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్​గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. 
 
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ధన్​సింగ్ రావత్​కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 48 ఏళ్ల ధన్​సింగ్​కు.. మర్యాదస్థుడిగా పేరు ఉంది. త్రివేంద్ర సింగ్ రావత్​కు అత్యంత సన్నిహితుడు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరితో పాటు భాజపా జాతీయ ప్రతినిధి అనిల్ బలునీ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అజయ్ భట్ పేర్లను సైతం అధిష్ఠానం పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. 
 
కాగా, రాజీనామా నాయకత్వ మార్పుపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్​ రాణిమౌర్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంతోనే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments