Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ఆ రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు - 13 మంది మృతి

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (09:37 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఓ పికప్ వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారిలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
కొందరు ప్రయాణికులతో పికప్ వ్యాన్ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్ - రీతా సాహిహ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థలు ఘటనాస్థలికి చేరుకోన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments