Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జీవిత కారాగారమే... ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (08:12 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే వివిధ రకాల రాత పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి జీవితకారాగార శిక్ష విధించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన అనేక పోటీ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయి. 
 
ఈ కారణంగా ఈ రాతపరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పైగా, రిక్రూట్మెంట్స్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకునిరాగా, దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదముద్రవేశారు. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు తప్పదని హెచ్చరించారు. కనీసం పదేళ్లకు తగ్గకుండా జైలుశిక్షలు ఉంటాలని స్పష్టంచేశారు. ఉన్నతస్థానానికి ఎదగాలన్న యువత కలలకు, ఆశయాలకు భంగం కలిగించే వ్యవహారాల పట్ల తమ ప్రభుత్వం ఎట్టి పరిస్తితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టంచేశారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడినవారికి జైలు శిక్షలేకాకుండా వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments