Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు నిర్లక్ష్యం.. చేతినుంచి జారిపడిన శిశువు మృతి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:05 IST)
లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందింది. 
 
ఇలా నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మృతశిశువు జన్మించాడంటూ వైద్యులు బుకాయించే యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. చింతన్‌ ప్రాంతానికి చెందిన మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
 
అయితే టవల్‌తో జాగ్రత్తగా ఎత్తుకోవాల్సిన శిశువును నర్సు నిర్లక్ష్యంగా ఒంటిచేత్తో పైకి లేపింది. దీంతో శిశువు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతిచెందాడు. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
 
మృత శిశువు జన్మించిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం కారణంగానే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు వెల్లడైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments