Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయ కావాలని మారాం చేసిన మేనకోడలి హత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేశాడో ఓ కిరాతకుడు. ఈ కిరాతకుడు అన్నం తింటుండగా వచ్చి మామిడికాయ కావాలంటూ పదేపదే కోరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ కిరాతకుడు ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి చంపేశాడు. దీంతో ఐదేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఈ దారుణం జరిగింది. 33 యేళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు వరుస అయ్యే ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చి మామిడికాయ కావాలంటూ అడిగింది. దీంతో తీవ్ర అసహనానికి లోనై ఉమర్దీన్ ఓ రాడ్‌ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ బాలిక అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఉమర్దీన్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి చిన్నారి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments