Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో మనిషి మాంసంతో కూర... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ తాగుబోతు పీకలవరకు మద్యం సేవించాడు. దీంతో కైపు నషాళానికెక్కింది. ఈ మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడనే విషయం మరిచిపోయాడు. దీంతో నేరుగా శ్మశానానికి వెళ్లి... ఓ మృతదేహం చేతిని నరికి ఇంటికి తెచ్చాడు. ఆ చేయి మాంసంతో కూర చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ టిక్కోపూర్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) అనే పచ్చి తాగుబోతు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతనో సైకోగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటీవల తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. 
 
అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను వేరుచేసి, మాంసాన్ని తీసి కూరవండాడు. 
 
ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు ఆమె సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments