Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో మనిషి మాంసంతో కూర... ఎక్కడ?

Uttar Pradesh
Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ తాగుబోతు పీకలవరకు మద్యం సేవించాడు. దీంతో కైపు నషాళానికెక్కింది. ఈ మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడనే విషయం మరిచిపోయాడు. దీంతో నేరుగా శ్మశానానికి వెళ్లి... ఓ మృతదేహం చేతిని నరికి ఇంటికి తెచ్చాడు. ఆ చేయి మాంసంతో కూర చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ టిక్కోపూర్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) అనే పచ్చి తాగుబోతు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతనో సైకోగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటీవల తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. 
 
అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను వేరుచేసి, మాంసాన్ని తీసి కూరవండాడు. 
 
ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు ఆమె సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments