Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన భర్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హెచ్‌ఐవి రోగికి ఉపయోగించిన సూదితో గర్భిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు ఒక భర్త. విడాకులు కావాలంటూ ఈ విధంగా అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహేశ్‌ గౌతమ్‌ అలీగఢ్‌లోని ఒక ఆస్పత్రిలోని ల్యాబ్‌లో కాంట్రాక్టు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
 
గతేడాది డిసెంబర్‌లో అతడికి ఒక యువతితో వివాహం జరిగింది. అయితే మహేశ్‌కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో.. ఆమెను విడాకులు కావాలంటూ వేధించడం ప్రారంభించాడు.
 
ఈ క్రమంలోనే ఒక హెచ్‌ఐవి రోగికి ఇచ్చిన సూదితోనే మహేశ్‌ తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచే భర్త తనకు హెచ్‌ఐవిని సోకేలా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
తన కుమార్తె అత్తామామలతో పాటు ఆస్పత్రి యజమాని కూడా ఈ కుట్రకు పాల్పడ్డారని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులే అని పేర్కొన్నారు. నిందితులతో పాటు ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం