Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్ ఫ్యాంట్ వేసుకుందనీ అమ్మాయిని కొట్టి చంపిన రాక్షసులు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:07 IST)
ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి జీన్స్ ఫ్యాంట్ వేసుకున్నందుకు కొట్టి చంపేశారు. ఈ దారుణం దియోరియో జిల్లాలో జరిగింది. ఆ యువతిని చంపేసి మృతదేహాన్ని ఓ వంతెన రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లిన ఆ యువతి కుటుంబం మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి స్వగ్రామానికి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి జీవనశైలిపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు. 
 
ఓ రోజు ఆమె ఉపవాసం చేసి, ఆ సాయంత్రం జీన్స్ ప్యాంట్, టాప్ ధరించి గుడికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో తండ్రి ఆమెను వారించాడు. ఆ వేషధారణ సరికాదని అన్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన వేషధారణ మార్చుకోకపోవడంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు ఆమెపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు.
 
స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, చనిపోయిన ఆ యువతిని బ్రిడ్జి రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments