Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్ ఫ్యాంట్ వేసుకుందనీ అమ్మాయిని కొట్టి చంపిన రాక్షసులు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:07 IST)
ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి జీన్స్ ఫ్యాంట్ వేసుకున్నందుకు కొట్టి చంపేశారు. ఈ దారుణం దియోరియో జిల్లాలో జరిగింది. ఆ యువతిని చంపేసి మృతదేహాన్ని ఓ వంతెన రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లిన ఆ యువతి కుటుంబం మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి స్వగ్రామానికి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి జీవనశైలిపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు. 
 
ఓ రోజు ఆమె ఉపవాసం చేసి, ఆ సాయంత్రం జీన్స్ ప్యాంట్, టాప్ ధరించి గుడికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో తండ్రి ఆమెను వారించాడు. ఆ వేషధారణ సరికాదని అన్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన వేషధారణ మార్చుకోకపోవడంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు ఆమెపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు.
 
స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, చనిపోయిన ఆ యువతిని బ్రిడ్జి రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments