Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడి హత్యకు ప్రతీకారం.. పప్పులో విషం కలిపిన బాలిక.. చివరికి?

ఓవైపు చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చిన్నారుల్లో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న బాలిక దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా స

Webdunia
గురువారం, 19 జులై 2018 (10:52 IST)
ఓవైపు చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చిన్నారుల్లో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న బాలిక దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా స్కూలు మధ్యాహ్న భోజనంలో విషం కలిపింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బంకట పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో మూడో తరగతి చదువుతున్న బాలిక సోదరుడు ఏడాది ఏప్రిల్‌లో మృతి చెందాడు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు విసిరిన రాయి బాలుడి తలకు బలంగా తాకడంతో చిన్నారి మృతి చెందాడు. అతడి మృతికి కారణమైన ఐదో తరగతి విద్యార్థిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.
 
అయితే తన సోదరుడిని చంపిన వారిపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న బాలిక మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న పప్పులో విష పదార్థాలను కలిపింది. ఈ భోజనాన్ని ఎవరూ తినకపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆహారం కల్తీ కాలేదని తేలింది. అందులో ఎటువంటి విషపదార్థాలు లేవని తేల్చారు. బాలికపై డియోరియో పోలీసులు సెక్షన్ 328 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను జువైనల్ హోంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments