Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశాడు... తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఇపుడు తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఈ దారుణం గత మంగళవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన యశ్‌వీర్‌ అనే నిందితుడు గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఈక్రమంలో అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. 
 
జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ జైలు పాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు‌పై విడుదలైన నిందితుడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకోపాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆ తల్లీకూతుళ్లు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది గమనించిన నిందితుడు.. తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments