మైనర్ బాలికపై అత్యాచారం.. యూపీలో పెచ్చరిల్లిపోతున్న నేరాలు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (13:31 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే ప్రాంతంలో తాజాగా మరో 17ఏళ్ల మైనర్‌ బాలికపై ఇదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో ఈ వరుస ఘటనలు వెలుగు చూశాయి. 
 
వివరాల్లోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్‌ బాలిక సోమవారం ఉదయం స్కాలర్‌షిప్‌ దరఖాస్తు నింపేందుకు ఇంటి నుంచి సమీప గ్రామానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం గాలిస్తుండగా రెండురోజుల అనంతరం గ్రామ శివారులో ఎండిపోయిన చెరువు నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూశారు. శరీర భాగాలు ముక్కలుగా పడివున్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
 
పోస్టుమార్టం నిర్వహించగా ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారని లఖీంపూర్‌ ఖేరీ ఎస్పీ సతేంద్ర కుమార్‌ సింగ్‌ తెలిపాడు. నిందితులకు సంబంధించిన ఆనవాళ్లు అభించాయని, వారికోసం ప్రత్యేక పోలిసు బృందం గాలిస్తోందని చెప్పారు. పది రోజుల క్రితం అదే జిల్లాలోని ఇసానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దుండగులు 13ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments