Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికను కిడ్నాప్ చేసి చెరకుతోటలోకి లాక్కెళ్లి.... నాలుక కోసి అత్యాచారం...

Advertiesment
Uttar Pradesh
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేసి కేకలు పెట్టకుండా ఉండేందుకు నాలుకను కత్తిరించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు కామాంధులు బలవంతంగా చెరకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమె నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. 
 
అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. త‌మ కూతురు ఇంటి వద్ద క‌న‌బ‌డ‌క‌పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. చెరుకు తోటల్లో ఆమె మృతదేహం ఉందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. దండగులు ఆమె క‌ళ్ల‌ను పీకేసినట్లు ఆ బాలిక తండ్రి అంటున్నాడు. 
 
అయితే, ఆ బాలిక క‌ళ్ల‌ను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొదల్లో వివాహితతో ప్రియుడు రాసలీలలు, కళ్ళారా చూసిన భర్త బండరాయితో?