Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలికను వేధించారు.. రెండంతస్తుల మేడ నుంచి తోసేశారు..

Uttar Pradesh
Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (15:08 IST)
17 ఏళ్ల బాలికను వేధించిన ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రతిఘటించడంతో రెండంతస్తుల మేడ నుంచి తోసేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఈ మొత్తం ఘటన సిసిటివి ఫుటేజ్‌లో రికార్డు అయింది. కాగా, తీవ్రంగా గాయపడ్డ యువతి... ప్రాణాలతో బయటపడ్డప్పటికీ... వెన్నుముక బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా, ముగ్గురు వ్యక్తులుపై తండ్రి ఫిర్యాదు చేశారు. వీరంతా తమ నివాసానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. గత కొన్ని రోజులుగా తన కుమార్తెను ఏడిపిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తి తన నెంబర్‌కు ఫోన్‌ చేసి... తన కుమార్తెతో మాట్లాడాలని కోరగా.. ఫోన్‌ ఇవ్వనని చెప్పడంతో... తనను తిట్టడం మొదలు పెట్టాడని తెలిపారు. 
 
అనంతరం అదే రోజు ఆమె ఇంటిలోకి ప్రవేశించి యువతిని వేధించి అక్కడ నుండి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతలో కుటుంబ సభ్యులు అరవడంతో రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు తోసేయడంతో ఆ యువతి రోడ్డుపై పడిపోయింది. తండ్రి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments