Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిఘటించిందనీ పదో అంతస్తు నుంచి తోసేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మనూ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు బలాత్కారం చేసేందుకు యత్నించారు. కానీ, ఆ కామాంధు చెర నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముగ్గురు కిరాతకులు.. ఆ యువతిని పదో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మనూ జిల్లాలో ఓ 15 ఏళ్ల యువ‌తి శుక్ర‌వారం రాత్రి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. స్థానికంగా ఉండే ముగ్గురు యువ‌కులు ఆమెను అడ్డ‌గించారు. బ‌ల‌వంతంగా ఓ భ‌వ‌నంలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించారు. 
 
యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతో.. కోపంతో యువ‌కులు ఆమెను మూడో అంత‌స్తు నుంచి కింద‌కు తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఇపుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని, దాంతో ప్ర‌తిఘటించ‌డంతోనే కింద‌కు తోసేశారు. త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని బాధితురాలు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం