Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు : మరో ఛాన్సిచ్చిన కేంద్రం

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (13:47 IST)
పన్ను చెల్లింపుదారులకు మరోమారు వెసులుబాటు లభించింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 సంవత్సర ఆదాయ పన్ను రిటర్న్స్ చెల్లింపు గడువు తేదీన మరోమారు పొడగించింది. ఇది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట కలిగించనుంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఆడిట్‌ చేసిన పద్దులు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శనివారం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. 
 
ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ప్రతి ఏటా ఐటీ రిటర్నులను జూలై 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్‌ చేసిన పద్దులు సమర్పించాల్సిన వారు అక్టోబరు 31 నాటికి రిటర్నులు ఫైల్‌ చేయాలి. 
 
అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల గడువును తొలుత జూలై 31 నుంచి నవంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా మరో నెల రోజుల అదనపు సమయం కల్పించింది. 
 
కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్‌కు మరింత సమయమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ పేర్కొంది.
 
అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు. ఇక ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్టు, అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పణకు ఈ డిసెంబరు 31 వరకు సమయం కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments