Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఓబీసీలకు 54 శాతానికి పెంచండి : ఎస్పీ

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (17:15 IST)
దేశంలో ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశంలో 98 శాతం పేదలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని 54 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుపై బుధవారం రాజ్యసభలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఇందులో రాంగోపాల్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 98 శాతం ఉన్న ప్రజలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఇపుడు ఉద్యోగాలన్నీ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారనీ, ఈ రిజర్వేషన్ల వర్తింపు ఔట్‌సోర్సింగ్‌కు కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో దళితులు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినా వారిని రిజర్వేషన్ కోటాలోనే ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ ఆయన సర్కారును నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments