Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సరే.. నా ఫ్రెండ్‌తోనూ సంబంధం పెట్టుకో... నో చెప్పిన మహిళను చంపేసిన వాచ్‌మెన్

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:45 IST)
ఆ మహిళతో అప్పటికే అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ వేధించాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో అత్యంత కిరాతకంగా ఆ మహిళను చంపేశాడో వాచ్‌మెన్.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్ ప్రాంతానికి చెందిన సుశీల్(40) వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయన వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సుశీల్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.
 
దీంతో ఈనెల ఆరో తేదీన ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments