Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సరే.. నా ఫ్రెండ్‌తోనూ సంబంధం పెట్టుకో... నో చెప్పిన మహిళను చంపేసిన వాచ్‌మెన్

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:45 IST)
ఆ మహిళతో అప్పటికే అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ వేధించాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో అత్యంత కిరాతకంగా ఆ మహిళను చంపేశాడో వాచ్‌మెన్.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్ ప్రాంతానికి చెందిన సుశీల్(40) వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయన వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సుశీల్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.
 
దీంతో ఈనెల ఆరో తేదీన ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments