Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (13:19 IST)
గేదెలు కొనుగోలు చేసేందుకు ఓ మహిళ రెండో పెళ్ళికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్ళి జరుగుతుందనగా అత్తామామలు వచ్చారు. దీంతో ఆ మహిళ షాకైంది. పెళ్ళి ఆగిపోయింది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాసన్ పూర్‌కు చెందిన ఆస్మా అనే మహిళ మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు, పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. 
 
దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్ళి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసంగ పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments