Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (13:19 IST)
గేదెలు కొనుగోలు చేసేందుకు ఓ మహిళ రెండో పెళ్ళికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్ళి జరుగుతుందనగా అత్తామామలు వచ్చారు. దీంతో ఆ మహిళ షాకైంది. పెళ్ళి ఆగిపోయింది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాసన్ పూర్‌కు చెందిన ఆస్మా అనే మహిళ మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు, పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. 
 
దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్ళి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసంగ పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments