Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భార్య సవతి తల్లి ఎలా అయింది?

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (18:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ భార్య ఒకరు సవతి తల్లి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బడాన్‌కు చెందిన మైనర్లు అయిన జంటకు గత 2016లో వివాహం జరిగింది. ఆరు నెలల తర్వాత వారిద్దరు విడిపోయారు. 
 
మేజర్‌ అయిన తర్వాత కలిసి ఉండేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా ఆ యువతి నిరాకరించింది. అతడ్ని తాగుబోతుగా ఆరోపించి విడాకులు డిమాండ్‌ చేసింది.
 
మరోవైపు పారిశుధ్య కార్మికుడిగా పని చేసే ఆ వ్యక్తి తండ్రి కొంత కాలంగా అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన సంభల్‌లో విడిగా ఉంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా తన 48 ఏండ్ల తండ్రి గురించి సమాచారం కోరాడు. 
 
ఇందులో తన మాజీ భార్యను తండ్రి పెండ్లి చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీనిపై బిసౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఇరు వర్గాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. 
 
కాగా, సవతి తల్లిగా మారిన మాజీ భార్య మొదటి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అతడి తండ్రిని పెండ్లి చేసుకున్న తాను సంతోషంగా ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments