వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు : వాతావరణశాఖ

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (18:29 IST)
వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా, దక్షిణ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. 
 
ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. అదేసమయంలో, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తాజా నివేదికలో తెలిపింది.
 
మరోవైపు, విశాఖ జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. జిల్లాలోని పాడేరు, చీడికాడ, దేవరాపల్లి, హుకుంపేట, అనంతగిరి, ఎల్.కోట, వేపాడ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. వ్యవసాయ క్షేత్రాల్లోని రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments